Tuesday, April 30, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు నిజాయితికి హ్యాట్స‌ఫ్..!

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు మ‌రోసారి త‌న మంచి మ‌న‌స్సుని చాటుకున్నాడు.మ‌హేశ్ బాబుతో సినిమా తీయ‌డానికి ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ఆయ‌న‌కు 5 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారు.ఇది ఎప్పుడు జరిగింతో తెలుసా? మ‌హేశ్ బాబు పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన బిజినెస్ మ్యాన్ టైంలో మ‌హేశ్‌తో మ‌రో సినిమా చేయ‌డానికి వెంక‌ట్ మ‌హేశ్‌కు 5 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారు.అయితే త‌రువాత మ‌హేశ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.డేట్స్ కూడా ఖాళీ లేవు. దీంతో వారు ఇచ్చిన 5 కోట్లు వ‌డ్డీతో స‌హా ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారట మ‌హేశ్ బాబు.

దీనికి సంభందించి ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంక‌ట్‌తో చ‌ర్చించినట్లు స‌మాచారం. ఈ విషయమై మహేష్ చాలా నిజాయితీగా ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. తీసుకున్న డ‌బ్బును ఎలా ఎగ్గొడ‌దమ‌ని చూసే ఈ రోజుల్లో ఎప్పుడు తీసుకున్న డబ్బుకి వ‌డ్డీతో స‌హా చెల్లించ‌డం అంటే మాములు విష‌యం కాదు అంటున్నారు నెటిజ‌న్లు.ఈ విష‌యంలో మ‌హేశ్‌కు హ్యాట్స‌ఫ్ చెబుతున్నారు మ‌హేశ్ ప్యాన్స్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -