టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ కష్టాల్లో పడింది. భారత్ బౌలర్ల దెబ్బకి ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. దీంతో టాప్ ఆర్డర్ కుదేలైంది. దూకుడు మీదున్న రాస్ టేలర్ను 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాదవ్ ఔట్ చేశాడు. 18 ఓవర్లో జాదవ్ వేసిన బంతికి టేలర్ స్టంప్ఔట్ అయ్యాడు. లాథమ్ హెన్రీ నికోల్స్లు ఆటను చక్కదిద్దే ప్రయత్నంలో లాథమ్ (34)33 వద్ద కుల్దీప్ వేసిన బంతికి ఎల్బీగా వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజ్లో హెన్రీ నికోలస్ 15, గ్రాండ్హోమ్ 1 తోనూ ఉన్నారు.
324 పుగుల భారీ లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ మొదట దూకుడును ప్రదర్శించింది. భారత బౌలర్ల ధాటికి కీలక వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. గప్తిల్ (15) స్థానంలో క్రీజులోకి వచ్చి వరుస బౌండరీలతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (20)ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం మరో ఓపెనర్ మన్రో (31)ను చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.26 వోవర్లు ముగిసే సమయానికి కీవీస్ 144/5 వికెట్లతో పోరాడుతోంది.