- Advertisement -
లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ఈసీ సిద్దధం అయ్యింది. సాయంత్రం 5 గంటలకు ఈసీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఆదివారం సాయంత్రం కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
అయితే గతంలో మాదిరిగా మీడియా సమావేశంలో ఈసీ కార్యాలయంలో కాకుండా విజ్ఞాన భవన్లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ పై ఈసీ క్లారిటీ ఇవ్వనప్పటికి రాజకీయా పార్టీలు మాత్రం నోటిఫికేషన్ను విడుదల చేసేందుకే మీడియా సమావేశం నిర్వహిస్తోందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం తొమ్మిది లేదా పది విడతల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.