Tuesday, May 14, 2024
- Advertisement -

బాబును A1 ముద్దాయిగా చేర్చే వరకు పోరాడతా: జగన్

- Advertisement -

వైసిపి అధ్యక్షుడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతిని తమ పార్టీ ఎంపీలతో కలిసి, ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అని మీడియాతో అన్నారు. చంద్రబాబు నాయుడుని A1 ముద్దాయిగా చేర్చి తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన సూచించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌ను స్కామాంద్ర ప్రదేశ్ గా మార్చారని మండి పడ్డారు. ఇంత నగ్నంగా వీడియో అండ్ ఆడియోతో బయట పడిన తర్వాత కూడా నిస్సిగ్గుగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ లో సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్దమై అందులో భాగంగా 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి కి దొరికారని ఆయన అన్నారు. ఈ విషయంపై కేంద్ర హో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను అలాగే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నామని ఆయన మీడియాకు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -