Tuesday, April 30, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ పై సీరియస్ అయిన రష్మీ..!

- Advertisement -

జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రష్మీపై సుధీర్ పంచులు వేయడం మాములే. చాలా సందర్భాల్లో అలానే చేశారు. ఇక రష్మీ కూడా అలానే చాలా సందర్భాల్లో చేసింది. అయితే తాజాగా ఓ షోలో రష్మీని ఉద్దేశించి సుధీర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సుధీర్, రష్మీని యూట్యూబ్ జోడిగా అందరు పిలిస్తుంటారు.

ఇందుకు కారణం వీరిద్దరిపై వచ్చే రూమర్స్. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని.. పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకల పుకార్లు షికారు చేశాయి. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చాలాసార్లే వీరిద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికి ఈ రూమర్స్ మాత్రం ఆగడటం లేదు. ఇక సుధీర్ ఫస్ట్ టైం హీరోగా సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో ఆలీ వేసిన ప్రశ్నకు సుధీర్ ఇచ్చిన జవాబు చూసి అందరు షాక్ అయ్యారు. ఒకవైపు దీపికా పదుకొనె, మరోవైపు ప్రియాంక చోప్రా ఉన్నారు.

వారిద్దరిలో ఒకరినే హగ్ చేసుకునే అవకాశం వస్తే ఎవరిని హగ్ చేసుకుంటావని ఆలీ వేసిన ప్రశ్నకు సుడిగాలి సుధీర్.. వాళ్ళను పక్కనబెట్టి తాను రష్మీ ఎక్కడ అని అడుగుతానని అన్నాడు సుధీర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే సుధీర్ మాటలు చూసిన రష్మీ ఈ సారి మాత్రం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం తన పేరును ఇలా వాడుకోవడం సబబు కాదంటూ తన సన్నిహితుల వద్ద వాపోతోందట రష్మీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -