పవన్ కళ్యాణ్ మాట ఎత్తుగానే చాలా ఫీల్ అవుతున్నారు రేణు దేశాయ్. పవన్తో విడిపోయి ప్రస్తుతం రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటుంది. ఇటీవల రేణు పోస్ట్ చేసిన ఫొటోకు ఓ నెటిజన్ ఇచ్చిన కామెంట్ రేణూకు కోపం తెప్పించింది. అకీరా తన చెల్లి ఆద్యను ఎత్తుకున్న ఫొటోను రేణు ఇటీవల ఇన్స్టాగ్రామ్ల పోస్ట్ చేశారు.
దీనికి క్యాప్షన్గా.. ‘1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను నీ ముందు ఉంటా. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. కానీ వారిద్దరూ నా సొంతం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకి సాయి పవన్ అనే నెటిజన్.. ‘ఎంతైనా పవన్ రక్తం కదా..’ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ రేణూకి నచ్చలేదు. సాయి పవన్ చేసిన కామెంట్కు రేణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘టెక్నికల్గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ మాటకు అర్థం తెలుస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. రేణు ఇచ్చిన ఈ రిప్లైకి చాలా మంది హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే రేణు చేసిన కామెంట్పై చరణ్ అనే నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘ఫ్యాన్స్తో ఇంత దురుసుగా ప్రవర్తించకండి మేడమ్’ అని సలహా ఇచ్చాడు.
ఇందుకు రేణు సమాధానమిస్తూ.. ‘అంటే ఫ్యాన్స్ నాలో ఉన్న అమ్మతనం గురించి దురుసుగా మాట్లాడొచ్చా’ అని ప్రశ్నించారు. అంతేకాదు ఏ ఆడపిల్లకైనా అన్న ప్రేమ దక్కాల్సిందే అని ఓ నెటిజన్ చేసిన కామెంట్కు రేణు రిప్లై ఇస్తూ.. ‘చెప్పాలంటే సోదరి ప్రేమ చాలా అవసరం. అకీరాకు అది కావాల్సినంత దక్కింది’ అని సమాధానం ఇచ్చారు. పవన్ తో విడిపోయిన రేణు దేశాయ్ మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అయింది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. త్వరలో పెళ్లి ఉండబోతుందని తెలుస్తోంది.