Friday, May 17, 2024
- Advertisement -

నాకు ఎప్పుడో పెళ్లైంది

- Advertisement -

కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌.కాని 2017లో ఈ భామ‌కు క‌లిసి రాలేద‌నే చేప్పాలి.కత్రినా కైఫ్ చేసిన ‘బార్‌ బార్‌ దేఖో’, ‘జగ్గా జాసూస్‌’ సినిమాలతో వరుస ఫ్లాప్‌లను చవిచూసింది ఈ భామ‌.2017లో చివ‌రిలో వ‌చ్చిన ‘టైగర్‌ జిందా హై’ సినిమా కత్రినా కైఫ్ కు ఊరటనిచ్చింది. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ఈ సినిమా వారం రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టి 2017లోనే బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా కత్రినా తన సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

త‌న జీవితంలో పెళ్లి చేస‌కుని పిల్ల‌ల్ని క‌నే స‌మ‌యం వ‌చ్చంది అని కాక‌పోతే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే కెరీర్ వెన‌క ప‌డిపోతుంది.ఆ స‌మ‌యంలో వివాహ జీవితానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌ల్సి ఉంటుంది కాబ‌ట్టి అప్పుడు కెరీర్ బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్టం అని చేప్పుకొచ్చింది ఈ భామ‌.నేను మాత్రం నాకు వివాహమైందనే భావిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు సినిమాలే జీవితం. జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం కావాలి. అంతేకానీ వచ్చే వ్యక్తి కోసం మనల్ని మనం కోల్పోకూడదు.’ అని చెప్పుకొచ్చారు.బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్న కత్రిన కొన్ని కారణాల వల్ల రెండేళ్ల క్రితం విడిపోయారు. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగితే.. ఇప్పటికైతే తనకు కెరీరే ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం కత్రినా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘జీరో’ సినిమాల్లో నటిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -