యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పండుగలాంటి వార్తను తెలియజేశారు సాహో చిత్ర యూనిట్. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన సాహో చాప్టర్ 1టీజర్కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా రెండో టీజర్ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు మార్చి 3న ఉండటంతో రెండో టీజర్ను ఆ రోజున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు తెరకెక్కిస్తున్నారు.హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు.నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీ వంటి పలువురు హిందీ నటులు ఇందులో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.