Friday, May 3, 2024
- Advertisement -

ప‌ల‌క‌రించ‌ని తెలుగు అవార్డులు

- Advertisement -
  • కానీ విదేశీ అవార్డుల క్యూ

ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అవార్డుల మీద అవార్డులు వ‌చ్చేస్తున్నాయ్‌. అదేందో గానీ మ‌న తెలుగు రాష్ర్టాల్లో, భార‌త‌దేశంలో అత‌డికి ఎవ‌రూ అవార్డులు, పుర‌స్కారాలు అందించ‌డం లేదు. విదేశీ సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాలు, ప్ర‌ముఖ నాయ‌కులు పిలిచి పిలిచి మ‌రీ అవార్డులు ఇచ్చేస్తున్నారు. అదేంటో వారికి ఆయ‌న ఎందుకు అంతా న‌చ్చేస్తున్నాడో అర్థంగానీ విష‌యం. గ‌తంలో ఓ ప్ర‌ముఖ విదేశీ విశ్వ‌విద్యాల‌యంలో వెళ్లి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉప‌న్యాసం ఇచ్చాడు. ఆ సంద‌ర్భంగా అక్క‌డ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు భారీ కార్ల ర్యాలీ నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఇండియా- యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రదానం చేసే ఎక్స్‌లెన్సీ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఆ అవార్డు అందుకోవ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మొన్న లండ‌న్‌కు వెళ్లాడు. విదేశీయుల‌కు న‌చ్చే వ్య‌క్తి త‌న సొంత ప్రాంతంలో న‌చ్చ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం. తెలుగు రాష్ర్టాల్లో ఎవ‌రూ ఆయ‌న‌కు బ‌హుమ‌తులు, అవార్డులు, పుర‌స్కారాలు అందించ లేదు. ఏ విశ్వ‌విద్యాల‌యం అత‌డిని పిలిచి ప్ర‌సంగించ‌మ‌ని అడ‌గ‌లేదు. అత‌డే అప్పుడ‌ప్పుడు ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యాన్ని పొగుడుతుంటాడు. కానీ ఎవ‌రూ పిల‌వ‌రు.

కానీ ఇక్కడ అత‌డికి ఒక్క పుర‌స్కారం కూడా రావ‌డం లేదు. చివ‌రికి మొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో కూడా ఒక్క‌టీ రాలేదు. ఆయ‌న దాదాపు 24 సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు 25వ సినిమా అజ్ఞాత‌వాసి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అత‌డి స‌మ‌కాలీడైన ప్రిన్స్ మ‌హేశ్‌బాబుకు అవార్డులు న‌డుచుకుంటూ వెళ్తాయి. న‌ట‌న బాగా లేదా అంటే సినిమాలు బాగానే ఆడుతున్నాయి. మ‌రీ జ్యూరీ వారికి అత‌డి న‌టన న‌చ్చ‌డం లేదా అని తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ త‌న స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో క‌లిసి అజ్ఞాత‌వాసిగా వ‌స్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రానుంద‌ని తెలుస్తోంది. పైగా ఇప్పుడు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌డంతో ఇక 25వ సినిమానే చివ‌రి సినిమాగా అని టాక్ న‌డుస్తోంది. అయితే ఈ విష‌యం మాత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని విష‌యం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -