Friday, April 19, 2024
- Advertisement -

‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ విడాకులు ఎందుకు తీసుకుంది ?

- Advertisement -

2002 లో వినీత్, అబ్బాస్ లు హీరోలుగా వచ్చిన ‘నీ ప్రేమకై’ సినిమాతో తెలుగులో పరిచయం అయింది సోనియ అగర్వాల్. ఈ మూవీ తర్వాత జగపతి బాబుతో ‘థమ్’ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. దాంతో ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే 2004 లో వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ మూవీ మాత్రం ఈమెకు విమరితమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

‘7/జి బృందావన కాలనీ’ మూవీ డైరెక్టర్ అయిన సెల్వ రాఘవన్ నే సోనియ ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్నాళ్ళ పాటు బాగానే వీరిద్దరు కలిసి ఉన్నారు. అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. అందుకు గల కారణాలను సోనియా ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘కెరీర్ విషయంలో అభిప్రాయబేధాలు రావడంతో మేము విడిపోయాం.

కానీ స్నేహితులుగా కలిసే ఉంటున్నాం’ అని చెప్పింది. ఇటీవల సోనియా రెండో వివాహం చేసుకోబోతుందని ప్రచారం కూడా నడిచింది. కానీ అందులో నిజం లేదని చెప్పుకొచ్చింది. ఇక సెల్వ రాఘవన్ తో విడాకులు తీసుకున్న తరువాత సోనియా.. ఎన్టీఆర్‘టెంపర్’, సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రెడ్’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర సోనియా నటించినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయిన అనసూయ..!

ఆరు నెలల ప్రెగ్నెంట్ కాబట్టే పవన్ సినిమా వదిలేశా : అనసూయ

సింగర్ సునీతకు కరోనా సోకింది.. ఇప్పుడెలా ఉంది ?

పడుకునే ముందు నా బెడ్ పై ఆ ముగ్గురు ఉండాలి : కస్తూరి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -