Friday, April 19, 2024
- Advertisement -

బతుకుతాం అనే ఆశ లేదు.. హంసానందిని!

- Advertisement -

ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాటలో సందడి చేసి అభిమానులను ఎంతగానో అలరించిన నటి హంసానందిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండే హంసానందిని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలోనే నెటిజన్లు అందరూ హంసానందిని కరోనా బారిన పడ్డారేమో అని భావించారు. అందరూ భావించినట్టు గానే ఈమె కరోనా బారిన పడి కోలు పోకున్నట్లు తాజాగా తెలియజేశారు.

హంసానందిని కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా దాదాపు 25 రోజుల పాటు ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలో ఉన్న 25 రోజులు ఎంతో నరకం చూశానని, అసలు బ్రతుకుతామనే ఆశ కూడా చచ్చిపోయిందని, దేవుడి దయవల్ల, డాక్టర్లు అభిమానులు బంధువుల ప్రార్థన ద్వారా బతికి బయటపడ్డామని హంసానందిని తెలిపారు.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

కరోనా ఎవరి పట్ల బేధాలు చూపించకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందుతున్న సంగతి మనకు ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ తారలు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హంసానందిని అభిమానులకు తెలియజేశారు.

Also read:డాక్టర్ల కోసం నాని స్పెషల్ ట్రీట్.. ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -