Monday, April 29, 2024
- Advertisement -

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి రిచా గంగోపాధ్యాయ

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రిచా గంగోపాధ్యాయ. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి చిత్రంలో ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. తాజాగా నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడనే శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించారు. బాబుకు ‘లుకా షాన్‌’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు.

చిన్నారి రాకతో తామందరం ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రూపురేఖల్లో అచ్చం తన నాన్న మాదిరే ఉన్నాడని చెప్పారు. అమెరికాలో పుట్టిపెరిగిన ‘లీడర్’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఉన్నత విద్య కోసం తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు.

అక్కడి బిజినెస్ స్కూల్లో సహాధ్యాయి జోను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించలేదు. తెలుగు లో ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’ చిత్రాల్లో నటించింది. చివరిగా 2013లో వచ్చిన ‘భాయ్‌’ సినిమాలో నటించింది.

ద్విపాత్రాభినయంలో మెప్పించిన తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -