తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 80వ దశకంలో తన అందమైన చిరునవ్వుతోనే కోట్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి సుహాసిని. స్టార్ హీరోల సరసన నటించిన సుహాసిన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అమ్మ,అత్త పాత్రల్లో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ నాట విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఆయనకు పలువురు సినీ నటుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే నటి రాధిక త్వరలో తమిళనాట జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ ఖచ్చితంగా గెలుస్తారని.. ఆయన సీఎం అవడం ఖాయం అని అన్నారు.
తాజాగా కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు తమ పార్టీ తరపున ప్రచారం చేయనున్న వారి జాబితాను మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో కమలహాసన్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు సీనియర్ నటి సుహాసిని రంగంలోకి దిగుతున్నారు.
ఈ ప్రచారంలో నటి శ్రీప్రియ, సినీ గేయరచయిత స్నేహన్, నటి సుహాసిని భర్త మణిరత్నం సహా 13 మంది ఉన్నారు. ఇక నటి సుహాసిన ఎవరో కాదు.. కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ కూతురు. తన బాబాయి కమల్ తరపున ప్రచారం చేయనుండడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుహాసిని పేర్కొన్నారు. పార్టీ ప్రచార ప్రతినిధిగా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కార్డు లభించిన వెంటనే ప్రచారానికి వెళ్తానని సుహాసిని తెలిపారు.
బెంగాల్ లో బాంబు దాడి.. బిజేపి ఎంపీ టార్గెట్..!