ప్రస్తుతం తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి అందరిలో నెలకొంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో గెలిచి కమల హాసన్ ముఖ్యమంత్రి అవుతారని సీనియర్ నటి, ఎస్ఎంకే నేత రాధిక జోస్యం చెప్పారు. ఈసారి డీఏంకే, అన్నాడీఎంకేలతో పాటు కమల్హాసన్ పోటీలో ఉన్నాడు. ఈ మద్య తమిళనాట జరిగిన సర్వేలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తేలింది. ఈ నేపథ్యంలో కమల్హాసన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని సీనియర్ నటి, సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) అగ్రనేత రాధిక తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో ఇండియా జననాయక కట్చి, మక్కల్ నీది మయ్యం, సమత్తువ మక్కల్ కట్చిలు కూటమి ఏర్పడి బరిలోకి దిగాయి. తమది బలమైన కూటమి అని రాధిక పేర్కొన్నారు. అంతే కాదు విద్యావంతులు, మేధావులు మార్పును కోరుకుంటున్నారని, ఇది చాలా అరుదైన ప్రగతిశీల ఆలోచన అని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం తమకు ఓటేస్తే పరిపాలనలో మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాధిక హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఆ అభ్యర్థి ముందంజ..!