ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిదాతో మళ్లీ మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల మళ్లీ అలాంటి విజయాన్నే పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరిందట. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నెట్టింట్లో హట్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 16న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు సినిమా యూటిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక నాగచైతన్య తన నెక్ట్స ప్రాజెక్ట్ కు గ్రీజ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెళ్ళి చూపులు సినిమాలో మంచి పేరు సంపాధించుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్తో నాగచైతన్య ఒక మూవీ చేయనున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పటికే కథను నాగ చైతన్యకు చెప్పాడంట. కథ నగచైతన్యకు కూడా ఎంతో భాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడని సమాచారం.
వర్మను కలిసిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ!
పాపం ఈ అమ్మడి ఆశలన్నీ దానిపైనే..