అక్కినేని నట వారసుడు హీరో అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం మిస్టర్ మజ్ను. మొదటి రెండు సినిమాలతో సరైన హిట్లు సాధించలేకపోయిన మూడో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో ఉన్నాడు. తొలిప్రేమ వంటి క్యూట్ లవ్ స్టోరీతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అఖిల్, నిధిలపై షాపింగ్ మాల్స్, పార్కుల్లో ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట టీమ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం పూర్తయిందని సమాచారం. ఇందులో అఖిల్ ప్లే బాయ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది, విద్యుల్లేఖా రామన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం.