హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం.బన్నీ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్ను చూస్తుంటే బన్నీ ఆర్మీ ఆఫీసర్గా సస్పెండ్ అవుతాడని తెలుస్తుంది.బోర్డర్ బయట కన్నా బోర్డర్ లోపల గురించే సినిమా ఉన్నట్లు ఈ ట్రైలర్ను చూస్తే అర్థం అవుతుంది.ట్రైలర్లో ఫ్యామీలి రీలేషన్ గురించి కూడా టచ్ చేశాడు దర్శకుడు . సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ రోల్ చేస్తున్నాడు.సినిమాలో సీనియర్ నటులు శరత్ కుమార్,నదీయా లాంటి వాళ్లుకూడా ఉన్నారు.
మాస్ ఎలిమెంట్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. తీవ్ర కోపంతో ఊగిపోయ్యే పాత్రలో బన్నీ యాక్టింగ్ ట్రైలర్కే హైలెట్ అవుతుంది మొత్తనికి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది.ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచియం అవుతున్నాడు.అల్లు అర్జున్కు జంటగా అను ఇమ్మాన్యుయేల్ చేస్తుంది.లగడపాటి శ్రీదర్,బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.మీలిటరి మాధవరంలో ఆడియో ఫంక్షన్ జరుపుకున్నా ఈ సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ ఈ నెల (ఏప్రిల్) 29న గచ్చిబౌలి స్టేడియంలో చేయడానికి ప్లాన్ చేశారు చిత్ర యూనిట్.మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బన్నీ.