Friday, May 17, 2024
- Advertisement -

సొంత బ్యానర్ లో మెగా హీరోల‌తో మూడు సినిమాలు నిర్మించ‌నున్న‌ అల్లూ అర‌వింద్ ….

- Advertisement -

అల్లు అరవింద్ భారీ బడ్జెట్ చిత్రాలను గీతా ఆర్ట్స్ పై .. ఓ మాదిరి బడ్జెట్ చిత్రాలను గీతా ఆర్ట్స్ 2పై చేస్తూ వెళుతున్నారు.సినిమా నిర్మాణం విషయంలో ఆయన పక్కాగా వ్యవహరిస్తారు. సొంత బ్యాన‌ర్‌లో రూపొందే చిత్రాలకు విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్ భారీ చిత్రాల్ని నిర్మించలేదు.

తాజాగా అరవింద్ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లతో ఆయన భారీ చిత్రాలకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ బ్యానర్లో భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమాను నిర్మిస్తారట. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ తదుపరి చిత్రం సొంత బ్యానర్ లోనే అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆలస్యం జరిగినా మంచి కథకోసం బన్నీ వెయిట్ చేస్తున్నాడు. నా పేరు సూర్య చిత్రం తరువాత ఇంత వరకు బన్నీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు

ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను చేయనున్నట్టు చెబుతున్నారు. ఆ వెంటనే చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. కొరటాల సినిమాను పూర్తి చేసిన తరువాత చిరంజీవి చేయబోయే సినిమా ఇదేనని అంటున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా .. అధికారికంగా ప్రకటించనున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -