Wednesday, May 15, 2024
- Advertisement -

తెలుగు యాంకర్‌, నటి మృతి.. ఎవరో తెలుసా..?

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే సీనియర్ నటులు, రచయిత, నిర్మాత ఎంవీఎస్ హరనాథరావు మరణవార్త ఇండస్ట్రీలో బాధపెడుతుంటే.. ఇప్పుడు ప్రముఖ టీవీ యాంకర్.. సినీ నటి మల్లిక అనారోగ్యంతో మృతి చెందారు.

కొంత కాలంగా ఆమే అనారోగ్యంతో బాధపడుతూ బెంగుళూరులో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో.. 10.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత సీరియల్స్, ఆపై వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంది మల్లిక. డిగ్రీ చేస్తున్న టైంలో తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు మల్లిక. తర్వాత సినిమాల్లో కూడా చాన్స్ రావడంతో కొంత కాలం గ్యాప్ తీసుకొని.. మళ్లీ బుల్లితెరపై యంకర్,సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. మల్లిక బుల్లితెర, వెండి తెర కెరీర్ పరంగా మంచి మార్కులే కొట్టేశారు.

అయితే ఆమె గత 20 రోజులుగా ఆమె కోమాలో ఉన్నారు. సోమవారం మల్లిక ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మరణించారు. ఆమె మరణం పట్ల సినీ, టీవీ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి. విజయ్ సాయి అనే వ్యక్తిని ఈమె పెళ్ళి చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఎం.అభినవ.. స్క్రీన్ నేమ్ గా మల్లిక అని పెట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -