తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘నువ్వునేను’ చిత్రం లో నటించిన అనితా హస్నందానీ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లింది. బాలీవుడ్ బుల్లితెరపై నాగిన్తో సీరియల్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం అనిత తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంది. కుమారుడు ఆరవ్ రెడ్డి పుట్టినప్పటి నుంచి అనిత ఇంటికే పరిమితమయ్యారు.
అయితే అని వెండితెర, బుల్లితెరకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పబోతుందన్న వార్తలు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో తల్లి పాత్ర ఎంతో గొప్పదని.. తనకు కుమారుడు పుట్టినప్పుడు టీవీ పరిశ్రమకు కాస్త విరామమిచ్చి కొడుకుతో గడపాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఇండస్ట్రీని విడిచిపెడుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని, ప్రస్తుతం కుమారుని సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నానని అన్నారు. త్వరలో బుల్లితెరపై తన ఎంట్రీ ఉంటుందని చెప్పారు.