యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత.ప్రస్తుతం సినిమా షూటింగ్ ,చివరి దశలో ఉంది.రెండు రోజులు క్రితమే సినిమా విడుదల తేదీని ఖారారు చేశారు.సినిమాను దసరాకు కానుకగా అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్ట్ర్ను రిలీజ్ చేసింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బయటికి వచ్చింది.ఇప్పటికే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం.
తెలుగులో రెండు, మూడు చిన్న చిత్రాల్లో నటించిన కన్నడ బ్యూటీ మేఘశ్రీ కి ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.తెలుగులో ఎలాంటి గుర్తింపు లేని మేఘశ్రీకి త్రివిక్రమ్ అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే సినిమాలో కేవలం గ్లామర్ పాత్రకు మాత్రమే ఆమెను తీసుకున్నట్లు సమాచారం.ఇక సినిమా విషయానికి వస్తే..ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది.రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదల అయిన పాటలకు,టీజర్కు మంచి స్పందన వచ్చింది.