దర్శక ధీరుడు రాజమౌళి బాహబలి సినిమా తరువాత తెలుగులో భారీ మల్టీస్టారర్కు తెరలేపిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్,రామ్ చరణ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్పై భారీగానే అంచనాలు ఉన్నాయి.ఇంకా సినిమా షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాపై అనేక వార్తలు వినబుతున్నాయి.సినిమాలో ఎన్టీఆర్ విలన్గా కనిపిస్తాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింంది.తాజాగా సినిమాకు సంబంధించిన మరో వార్త ఒకటి బయటికి వచ్చింది.
సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీన్ కోసం రాజమౌళి భారీగా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఈ ఒక్క సన్నివేశాన్ని దాదాపు 45 రోజుల పాటు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని అందులో ఒక విదేశీ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.