‘బాహుబలి’ని కొట్టే సినిమా చేయాలని చూస్తోంది కోలీవుడ్. సీనియర్ డైరెక్టర్ సుందర్.సి ఈ ప్రయత్నంలోనే ‘సంఘమిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సుందర్ చాలా కాలంగా ఈ ప్రాజెక్టు మీద పని చేస్తుండగా.. రెగ్యులర్ షూటింగ్కు రంగం సిద్ధం చేశాడు. ప్రస్తుతం కేన్స్లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం విశేషం.
ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న జయం రవి, ఆర్య, శ్రుతి హాసన్లతో పాటు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్.. నిర్మాతలతో కలిసి సుందర్ కేన్స్కు చేరుకున్నాడు. సంఘమిత్ర’ టీం అక్కడ సందడి చేయడానికి ముందు.. ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ ‘తెండ్రాల్ ఫిలిమ్స్’. అది చూస్తే.. ‘సంఘమిత్ర’ బాహుబలి బాటలోనే సాగుతుందని.. రాజమౌళి సినిమాకు దీటుగానే ఉంటుందని అర్థమవుతోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
భారీ ఓడలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో భయానక వాతావరణం మధ్య ప్రయాణిస్తుంటే.. అందులో ఒక ఓడపై ఓ యోధుడు నిలబడి ఉన్నాడు. బహుశా ఆ యోధుడు జయం రవినే కావొచ్చేమో. ఈ ఫోటో చూస్తుంటే.. ఈ సినిమా భారీగా నిర్మించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’ లాగా విజువల్ వండర్ అయ్యేందుకు ఆస్కారాలు లేకపోలేదని అనిపిస్తోంది. ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అని చెప్పలేదు కానీ.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో దీనికి ఖర్చు పెడుతున్నట్లుగా చెప్పాడు సుందర్.
{loadmodule mod_sp_social,Follow Us}
Related