రవితేజ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.నేల టిక్కెట్టుతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.రవితేజ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాను ప్రారంభించారు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్గా శృతిహాసన్ చేస్తుండగా మరో హీరోయిన్గా అను ఇమ్మాన్యూల్ నటిస్తుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. కాని సడన్గా ఈ సినిమా నుండి తప్పుకుంది అను ఇమ్మాన్యూల్.
కుటుంబ సమస్యల కారణంగా అను ఇమ్మాన్యూల్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కూడా ధృవికరించారు.సినిమా షూటింగ్ విదేశాలలో ఎక్కువ రోజులు కావడం,ఒప్పుకున్న సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నాని తన ట్వీట్టర్ ద్వారా తెలిపింది అను ఇమ్మాన్యూల్.ఇప్పుడు ఆమె ప్లేస్లో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.గోవా బ్యూటీ ఇలియానాను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని సమాచారం.
Unfortunately I won’t be a part of #AmarAkbarAnthony due to date clash between #SailajaReddyAlludu
I wish the team of #AmarAkbarAnthony all the best 🙏🏼😊 https://t.co/knQr32bZaw— Anu Emmanuel (@ItsAnuEmmanuel) May 19, 2018