Tuesday, May 14, 2024
- Advertisement -

సందీప్ వంగా నెస్ట్ మూవీ ..మ‌హేష లేక చ‌ర‌ణా

- Advertisement -

మొద‌టి సినిమాతోనే ఇండ‌స్ట్రీ మొత్తం త‌న‌వైపు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.అర్జున్‌రెడ్డి లాంటి విభిన్న చిత్రంతో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందారు. అర్జున్‌ రెడ్డి సినిమా త‌రువాత మ‌నోడి రేంజ్ మారిపోయింది.విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోని చేశాడు సందీప్‌.పెద్ద హీరోలు, నిర్మాతలు సందీప్ కోసం క్యూ క‌డుతున్నాయి.మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం మంచి క‌థ ఉంటే సినిమా తీద్దాం అన‌టాన్ని చూస్తే తెలియ‌డం లేదా సందీప్ ఎంత టాలెంటో అని.అర్జున్‌ రెడ్డి తరువాత ఇప్పటివరకు సందీప్‌ ఏ ప్రాజెక్టును ఫైనల్‌ చేయలేదు.

మహేశ్‌ బాబు ఇంటికి వెళ్లి ఓ కథ వినిపించాడని, ఆ కథ మహేష్‌కు నచ‍్చిందని, వంశీ పైడిపల్లి సినిమా అనంతరం ఈ సినిమా రానుంద‌ని స‌మాచారం.రామ్‌ చరణ్‌తోనూ ఓ సినిమా ఫైనల్‌ అయినట్టు వార్తలు వస్తున్నాయి.రంగస్థలం సక్సెస్‌ మీట్‌లో సందీప్‌ రెడ్డి పాల్గొనటంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. మ‌రి త‌న త‌రువాత సినిమా మ‌హేష్‌తోనా లేక రాంచ‌ర‌ణ్‌తోనా అనేది సందీప్ అధికారంగా ప్ర‌క‌టించేవ‌ర‌కు చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -