Thursday, May 2, 2024
- Advertisement -

బాహుబ‌లి (vs)2.O నాలుగు రోజ‌ల క‌లెక్ష‌న్స్‌

- Advertisement -

ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఏ మూహార్త‌నా 2.0 మొద‌లు పెట్టాడో కాని ,సినిమా మొద‌టి నుంచి బాహుబ‌లితో పోల్చ‌డం మొద‌లుపెట్టారు.బ‌డ్జెట్,గ్రాఫిక్స్‌,క‌లెక్ష‌న్లు ఇలా ప్ర‌తి దానిలో 2.0ని బాహుబ‌లితో పోల్చి చూస్తున్నారు.ఇండియ‌న్ సినిమాల‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది 2.0.దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా గ‌త గురువారం మొద‌లైంది.సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో త‌లైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 2.0విడుద‌ల ద‌గ్గ‌ర నుంచి బాహుబ‌లి క‌లెక్ష‌న్స్‌తో పోల్చ‌డం కామ‌న్ అయింది.అయితే 2.0 క‌లెక్ష‌న్లు గురించి ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మాత‌లు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు.

తాజాగా ఈ సినిమా మొద‌టి నాలుగు రోజుల క‌లెక్ష‌న్లను తమిళ సినిమా విశ్లేషకుడు రామేష్ బాలా నేడు తన ట్విట్టర్ లో అధికారికంగా కొన్ని వివరాలను తెలియజేశారు. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో నాలుగువందల కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది. యూఎస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌లో అత్యధిక వసూళ్లను అందుకున్న సౌత్ చిత్రంగా 2.0 నిలిచిందని పేర్కొన్నారు.అయితే ఓవ‌ర్ఆల్‌గా బాహుబ‌లితో పోలిస్తే ఇది త‌క్కువే అని చెప్పాలి.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి -2 మొద‌టి నాలుగు రోజుల‌లోనే దాదాపు 700 కోట్లు సాధించింది.బాహుబ‌లి -2 ఇండియ‌న్ సినిమాల‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా చ‌రిత్ర సృష్టించింది.

బాహుబ‌లి – 2 దాదాపు 2000 కోట్లు సాధించింది.బాహుబ‌లిని బీట్ చేస్తుంద‌ని భావించిన 2.0 మాత్రం ఆ ద‌రిదాపుల్లో ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు.యూఎస్‌లో 2.0 కొన్న బ‌య్య‌ర్ల‌కు సినిమా న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే ఇండియాలో మాత్రం ర‌జినీ మ్యానియా కొన‌సాగుతుంద‌ని తెలుస్తుంది.ఇక తెలుగు,హింది భాష‌ల‌లో కూడా సినిమా స్ట్రాంగ్ క‌లెక్ష‌న్లు సాధించిన‌ట్లు రామేష్ బాలా తెలిపారు.2.0 ఓవ‌ర్ఆల్‌గా 1000 కోట్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని సినీ పండితులు తెలుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -