Thursday, May 16, 2024
- Advertisement -

షూటింగ్ పూర్తి చేసుకున్న‘జైసింహా’

- Advertisement -

నంద‌మూరి బాలకృష్ణ న‌టిస్తున్న‘జైసింహా’ షూటింగ్ బుధ‌వారం (డిసెంబ‌ర్ 27)తో పూర్త‌య్యింది. బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ తీస్తున్నారు. ఇటీవ‌ల‌నే ఈ సినిమా ఆడియో వేడుకను విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు. బాల‌య్య‌కు జోడీగా నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మ‌డికాయ కొట్టేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో చివ‌రి సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాత సి.క‌ల్యాణ్ గుమ్మ‌డికాయ కొట్టి సినిమా ప‌నుల‌కు ముగింపు ప‌లికారు. సంక్రాంతి బ‌రిలో జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -