- Advertisement -
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘జైసింహా’ షూటింగ్ బుధవారం (డిసెంబర్ 27)తో పూర్తయ్యింది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ‘జైసింహా’ తీస్తున్నారు. ఇటీవలనే ఈ సినిమా ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించారు. బాలయ్యకు జోడీగా నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేశారు. రామోజీ ఫిల్మ్సిటీలో చివరి సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాత సి.కల్యాణ్ గుమ్మడికాయ కొట్టి సినిమా పనులకు ముగింపు పలికారు. సంక్రాంతి బరిలో జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.