సీనియర్ హీరోహిన్ నటి భూమిక మరోసారి తెరమీద కనిపించనుంది.పెళ్లైన తర్వాత సినమాలు దూరమయిన భూమిక దూరంగా ఉన్న సంగతి తెలిసందే.ఈ మధ్య భూమిక కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలొచ్చాయి.
పోయినేడాది బాలీవుడ్ మూవీ ‘ఎం.ఎస్.ధోని’లో హీరో అక్క పాత్రలో కనిపించింది భూమిక. అందులో తన లుక్ చూడగానే ఇక ఆమె అక్క, వదిన పాత్రలకు ఫిక్సయిపోవాల్సిందే అన్న అభిప్రాయం కలిగింది.
భూమిక ప్రస్తుతం ఒక క్రేజీ మూవీలో అవకాశం దక్కించుకోవడం విశేషం. మూడేళ్ల క్రితం ‘ఏప్రిల్ ఫూల్’ అనే సినిమాలో మెరిసిన హీరోయిన్ భూమికా చావ్లా ఆ తర్వాత మరే ఇతర తెలుగు సినిమాల్లోనూ నటించలేదు. ఇప్పుడు కొత్త న్యూస్ ఏమిటో తెలుసా భూమిక మళ్ళీ టాలీవుడ్ లో అడుగు పెట్టేసింది .
{loadmodule mod_custom,GA1}
నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘ఎంసీఏ’లో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మరి ఆమె నానికి అక్కగా నటిస్తోందా.. వదినగా చేస్తోందా.. ఇంకేదైనా పెద్ద తరహా పాత్ర చేస్తోందా అన్న చర్చలు మొదలయ్యాయి.దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేసేశారు.
భూమికతో పాటు మరో సీనియర్ నటి ఆమని కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. నాని ప్రస్తుతం మాంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో అతడి సినిమాలో భూమిక హైలైట్ అయితే…మున్ముందు మరిన్ని సినిమాలల్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది సిని వర్గాల టాక్..
{loadmodule mod_custom,GA2}
Also read