బిగ్బాస్ శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్ నూతన్ నాయుడు గాయపడటం,అతి తీవ్రతరం కావడంతో అనుహ్యంగా అతను హౌస్ నుండి బయటికి వెళ్లాల్సి వచ్చింది.దీంతో హౌస్మెట్స్ అందరు తీవ్ర వేదనకు లోనయ్యారు.కాని ఒక్కరు తప్ప….నూతన్ నాయుడు బయటికి వెళ్లడం ద్వారా దీప్తి సునైనా తనకు లాభిస్తుందనే ఆలోచనలో ఉంది. నూతన్ నాయుడు బయటికి వెళ్తే దీప్తి సునైనాకు చాలా లాభం చేకురుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ వారం ఎలిమినేషన్లో నూతన్ నాయుడుతో పాటు దీప్తి సునైనా,రోల్ రైడా,శ్యామల,గీతా మాధురి,పూజా రామా చంద్రన్లు ఉన్నారు.ఇక వారం హౌస్ నుండి దీప్తి సునైనానే వెళ్లుతుందని అందరు గట్టిగా నమ్ముతున్నారు.కాల్ సెంటర్ టాస్క్లో దీప్తి సునైనా కౌశల్తో ప్రవర్తించిన తీరు చూసిన వారందరు ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారని సమాచారం.పలు యూట్యూబ్ చానెల్స్ నిర్వహించిన పోల్లో కూడా దీప్తియే బయటికి వెళ్లుతుందని తెలింది.కాని అనుహ్యంగా గాయంతో నూతన్ నాయుడు బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో దీప్తి సునైనాకు లాభం చేకురుతుందని కొందరు భావిస్తున్నారు.అది ఎలాగో ఓ సారి చూద్దాం.
హౌస్లో తక్కువ ఓట్లు వచ్చిన వారు హౌస్ నుండి బయటికి వెళ్తారు.అయితే ఎలిమినేషన్లో ఉన్న నూతన్ నాయుడు గాయం కారణంగా హౌస్ను వదిలి బయటికి వచ్చేశాడు.అతను మళ్లీ తిరిగి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ,కాబట్టి ఈ వారం అతను(నూతన్ నాయుడు) ఎలిమినేషన్ అయినట్లు ప్రకటిస్తే,దీప్తి సునైనా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లే.అప్పుడు దీప్తి సునైనాకు తక్కవ ఓట్లు వచ్చిన ఆమె హౌస్లోనే కొనసాగుతుంది.ఈ విధాంగా నూతన్ నాయుడు బయటికి వెళ్లిపోవడం వల్ల దీప్తి సునైనాకు లాభం చేకురుతుంది.ఒకవేళ బిగ్బాస్ టీం యథావిధిగా ఈ వారం ఎలిమినేషన్ కొనసాగిస్తే దీప్తికి తిప్పలు తప్పవు.మరి ఈ రోజు జరుగుతుందో చూడాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.