Monday, April 29, 2024
- Advertisement -

మ‌ళ్లీ కౌశ‌లే మిస్ అయ్యాడుగా…!

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం వివదాల చూట్టునే సాగింది.17 మంది కంటెస్టెంట్లతో మొద‌లైన ఈ షోలో చివ‌రికి బిగ్‌బాస్ విన్న‌ర్‌గా కౌశ‌ల్ నిలిచిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.రెండో సీజ‌న్ మొత్తం కౌశ‌ల్ చూట్టునే తిరిగింది.హౌస్‌మెట్స్ అంద‌రు క‌లిసి కౌశ‌ల్‌ను ఒంట‌రిని చేసి గేమ్ ఆడుతున్న విధానాన్ని అంద‌రు వ్య‌తిరేకించారు.బిగ్‌బాస్ పూర్తి అయి దాదాపు నెల రోజులు కావ‌స్తున్న ఇంకా ఈ షో సంబందించిన వారు ఎక్క‌డో ఒక చోట హడావిడి చేస్తున్నారు.షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత కూడా హౌస్‌మెట్స్‌లో ఎటువంటి మార్పు లేదు.రియ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్స్ అంటూ తేజ‌స్వి ఓ ఫోటోని అప్ప‌ట్లో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలో కౌశ‌ల్ లేక‌పోవ‌డంతో తేజ‌స్విపై నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే మ‌రోక‌టి జరిగింది.రెండో సీజ‌న్‌లో పాల్గోన్న సెల‌బ్రిటీలంద‌రు ఒక చోట సంద‌డి చేశారు.అయితే ఈ పార్టీకి బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ లేక‌పోవ‌డంపై ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.తాజాగా నందిని ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకలో నందినితో పాటు.. సామ్రాట్, తనీష్, గీతామాధురి, రోల్ రైడా, దీప్తి సునైనా, తేజస్వి మదివాడ, భానుశ్రీ , శ్యామల, సంజన అన్నే, గణేష్ లు పాల్గొన్నారు. కంటెస్టెంట్స్ కౌశల్ కి ఫోన్ చేసి పిలవాలని ప్రయత్నిస్తున్నా ఆయన మాత్రం ఆన్సర్ చేయడం లేదని సమాచారం. బిగ్ బాస్ షో తరువాత కౌశల్ బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే ఆయన ఈ పార్టీలకు హాజరు కావడం లేదట‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -