బిగ్బాస్ రెండో సీజన్ చివర మజిలికి చేరుకుంది.రేపటితో(ఆదివారం) రెండో సీజన్ ముగియనుంది. న్యాచురల్ స్టార్ నాని హౌస్ట్గా వ్యవహరించిన, బిగ్బాస్ రెండో సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో మొదలైంది.వీరిలో ఐదుగురు మాత్రం బిగ్బాస్ ఫైనల్స్కు చేరారు.గీతా మాధురి,కౌశల్,తనీష్,దీప్తి,సామ్రాట్లు బిగ్బాస్ ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే.షో మరో రెండో రోజుల్లో ముగియనుండటంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులను అందరిని(ఒక్కరిని తప్ప) బిగ్బాస్ ఇంటికి తిరిగి పిలిపించి హౌస్మెట్స్ సభ్యులకు షాక్ ఇచ్చారు.
శుక్రవారం ఎపిసోడ్లో గీతా మాధురి,కౌశల్ బిగ్బాస్ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి వారి జ్ఞాపకాలను చూపించడం జరిగింది.సడన్ ఎలిమినేట్ అయిన సభ్యులను చూసి హౌస్మెట్స్ షాక్ అయ్యారు.తాజాగా ఈ రోజు ప్రోమోని విడుదల చేశారు బిగ్బాస్.ఈరోజు కూడా ఎలిమినేట్ అయిన సభ్యులు హౌస్లోనే ఉన్నట్లు ప్రోమోలో చూపించడం జరిగింది.హౌస్మెట్స్ అందరు కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు మనం ప్రోమోలో చూడవచ్చు.బిగ్బాస్ ఫైనల్కి వెళ్లిన వారికి ఈ రోజు లాస్ట్ కావడంతో ఈ రోజు ఎపిసోడ్ చాలా ఆసక్తి నెలకొంది.