Sunday, May 5, 2024
- Advertisement -

గీతా మాధురి సవాల్ స్వీకరించిన కౌషల్ ఆర్మీ

- Advertisement -

ఫైనల్స్ దగ్గర పడిన కొద్దీ బిగ్ బాస్ గేమ్ షో రసవత్తరంగా సాగుతోంది. కౌషల్ ను ఓడించాలనే, బిగ్ బాస్ గీతామాధురిని ఎంకరేజ్ చేస్తున్నాడనే ఆరోపణలను కౌషల్ ఆర్మీ గుప్పిస్తోంది. తాజాగా మూడు రోజులు పాటు సాగిన బోరింగ్ మర్డర్ టాస్క్ లో లొసుగులే అందుకు ప్రధాన సాక్ష్యం అంటున్నారు. కావాలనే కౌషల్ ను వరుసగా ఈ సీజన్ అంతా నామినేట్ చేయాలని, ముందే ప్లాన్ చేసుకున్నారనే ట్రోల్స్ నడుస్తున్నాయి. గీతామాధురికి టాస్క్ అప్పగించినప్పుడే, అందులో గెలిస్తే ఆమెకు కలిగే బెనిఫిట్స్ ఏంటో బిగ్ బాస్ ముందే చెప్పేశాడు. గెలిస్తే ఆమె నామినేట్ కాకుండా ఉంటుందని చెప్పాడు సరే. దాంతో పాటు మరో సభ్యుడుని సీజన్ అంతా నామినేట్ చేసుకోవచ్చని ముందే చెప్పడంతో ఆమె కసితో ఆడిందని తేలిపోయింది. ఇన్నాళ్లూ ఏ టాస్క్ ను సీరియస్ గా తీసుకోని గీతామాధురి మర్డర్ టాస్క్ ను మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. తన లోని సింగర్ కంటే మహానటి ఉందనే విషయం ఈ టాస్క్ ద్వారా తెలిసిందని నెటిజన్లు, బిగ్ బాస్ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనకు ఫైనల్ లో కౌషల్ గట్టి పోటీ ఇస్తాడని, అతడికి కౌషల్ ఆర్మీ ఫుల్ సపోర్ట్ ఉందని, అందుకే కౌషల్ ను ఎలాగైనా ఇంటికి పంపాలని భాావించే గీతామాధురి అంత సీరియస్ గా ఈ టాస్క్ ఆడిందని అర్ధమైపోయింది. అందుకే ఇన్నాళ్లూ ఏ టాస్క్ లో ఆడని విధంగా ఆమె సర్వశక్తులు ఒడ్డి జీవించేసిందని కౌషల్ ఆర్మీ ట్రోల్స్ చేస్తోంది.

అయితే కౌషల్ ఆర్మీ గురించి శేఖర్ అనే అభిమాని కౌషల్ కు ఫోన్ చేసి చెప్పాడు. కానీ పూర్తి వివరాలు చెప్పలేదు. కానీ శ్యామల మొత్తం కౌషల్ ఆర్మీ బలం, వారి ఓటింగ్ విధానం, ఎలిమినేట్ చేయాలంటే వేసే వ్యూహం గురించి మొత్తం వివరించేసింది. ఇప్పటికే కౌషల్ కు సపోర్ట్ చేస్తున్నాడనే కసితో నూతన్ నాయుడుని శ్యామల నామినేట్ చేసింది. దాంతో పాటు బయట నూతన్ నాయుడు పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలను ఇంటి సభ్యులకు చెప్పేసింది. వారిని కూడా ఇన్ ఫ్లుయెన్స్ చేసి వారితోనూ నూతన్ నాయుడుని నామినేట్ చేయించింది. ఇక ప్రధానంగా గీతామాధురికి గట్టి పోటీ కౌషల్ నుంచేనని ఆమె చెప్పేయడం వల్లే గీత అంతగా కౌషల్ మీద కక్షగట్టేసిందిని బిగ్ బాస్ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అయినదానికీ కానిదానికి కౌషల్ మీద అరుస్తూ, ఆమె అతడిమీద ఎమోషనల్ అత్యాచార్ చేస్తోందని, మళ్లీ కౌషల్ తనను ఎమోషనల్ అత్యాచార్ చేస్తున్నాడని ఆరోపించడం దారుణమని కౌషల్ ఆర్మీ మండిపడుతోంది.

శ్యామల కౌషల్ ఆర్మీ ఓట్లుతోనే రీ ఎంట్రీ, కౌషల్ అభిమానులకే వెన్నుపోటు పొడిచిందని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక గీతామాధురి ఫైనల్ విన్నర్ టైటిల్ పై కన్నేసి కౌషల్ ను ఎలాగైనా రెచ్చగొట్టి, అతడి సహనానికి పరీక్ష పెట్టి, అతడు ఓపెన్ అయిపోయేటట్టు చేయాలని గేమ్ ప్లాన్ చేస్తోందని కౌషల్ ఆర్మీ అంటంది. గీతా మాధురి ఎన్నిసార్లు నామినేట్ చేసుకున్నా తమకు ఫర్వాలేదని ధీమా వ్యక్తం చేస్తోంది. వందల అకౌంట్స్ తో వేల ఓట్లు ఒక్కొకరం వేస్తాం. అఖండ మెజార్టీతో కౌషల్ ను గెలిపిస్తాం. అని కౌషల్ అభిమానులు అంటున్నారు. కౌషల్ ఆర్మీ ఉందిగా సేవ్ చేయడానికి, వాడుకుందాం, అని గీతామాధురి వెటకారంగా మాట్లాడిన మాటలు మమ్మల్ని ఆమె సవాల్ చేసినట్టుగానే భావిస్తున్నాం. ఆమె సవాల్ స్వీకరిస్తున్నాం. కౌషల్ ఆర్మీ అంటే బిగ్ బాస్ ప్రేక్షకులే, ప్రజలే. ప్రజల ఓట్లుతోనే బిగ్ బాస్ విజేతలయ్యేది. అలాంటి ఓటర్లనే ఆమె సవాల్ చేసింది. ఆమె సవాల్ స్వీకరించి, కౌషల్ ను సేవ్ చేయడం కాదు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిపి మా సత్తా చాటుతాం..అని కౌషల్ ఆర్మీ చెబుతోంది. మొత్తానికి ఫైనల్ దగ్గరవుతోన్న కొద్దీ బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయటా హీట్ బాగానే పెరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -