తెలుగు బిగ్బాస్ సీజన్ 2 విజేత సగం రోజులు అయ్యేలోపే ఎవరనేది తేలిపోయింది. 15 వారాల షో జూన్ 10న ప్రారంభమైంది. ఇప్పటికి 53 రోజుల షో పూర్తయింది. సెప్టెంబర్ 23న షో విజేత ఎవరనేది ప్రకటిస్తారు. అంటే.. మరో 52 రోజులు షో మిగిలి ఉంది. కానీ.. బిగ్బాస్ విజేత ఎవరనేది.. ఇప్పటికే స్పష్టమైపోయింది. బిగ్బాస్ హౌస్లో వైల్డ్కార్డ్ ఎంట్రీలతో కలిపి 17మందిని లోపలికి పంపించారు. నూతన్నాయుడు, శ్యామల రీంట్రీ అయినా.. పాతవాళ్లే కావడంతో వాళ్లను మళ్లీ లెక్కించక్కర్లేదు. అందుకే.. 17మంది బిగ్బాస్లోనికి రాగా.. ప్రస్తుతం ఇంకా 14మంది ఉన్నారు. వీరిలో చివరి వరకూ హౌస్లో ఎవరు ఉండబోతున్నారు. విజేతగా ఎవరు నిలవబోతున్నారనేది క్లియర్గా తెలిసిపోతోంది. హౌస్లో ఒకేఒక్క మగాడిగా.. వన్మ్యాన్ ఆర్మీగా.. జన నీరాజనాలు అందుకుంటున్న కౌశల్ మందా.. తెలుగు బిగ్బాస్ సీజన్ 2 విజేత అనే విషయం స్పష్టమైపోయింది.
కౌశల్ మందా.. మోడల్గా, నటుడిగా, దర్శకుడిగా, ఈవెంట్స్ నిర్వాహకుడిగా, లుక్స్ ఫ్యాషన్ సంస్థ యజమాని. బిగ్బాస్లోనికి రాకముందు కౌశల్ అంటే మోడలింగ్ రంగంలోని వారికి తప్ప మిగతా వారికి పెద్దగా తెలియని పేరు. బిగ్బాస్ హౌస్లోనికి వచ్చాక.. తన నిజాయతీ, వ్యక్తిత్వం, పోరాట పటిమ, దేనిలోనైనా గెలవాలనే తపన, ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా ఉండే నైజం.. యువతకు బాగా నచ్చేశాయి. హౌస్లోని ఓ ఐదారుగురు కలిసి గ్రూపుగా ఏర్పడిపోయి.. ప్రతిసారీ కౌశల్కు కావాలని టార్గెట్ చేయడం.. అతనొక్కడే వారిని ధీటుగా ఎదిరించడం.. జనానికి తెగ నచ్చేసింది. అంతే.. కేవలం నెల రోజుల్లోనే కౌశల్కు బిగ్బాస్ చూసే వారిలో 80శాతం మంది అభిమానులుగా మారిపోయారు. మరో 20 రోజులు తిరిగే సరికి.. 50 రోజుల్లో కౌశల్ ఓ వ్యక్తి నుంచి ఓ శక్తిగా మారిపోయాడు. ఇప్పుడు కౌశల్ ఆర్మీ పేరుతో ఓ పెద్ద ఫ్యాన్ బేస్డ్ క్యాంప్ అతని కోసం సైన్యంలా పనిచేస్తోంది. ప్రాంతాల వారీగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జిల్లా, నగరం, పట్టణానికో కౌశల్ ఫ్యాన్ గ్రూపులు ఏర్పడ్డాయి. వీరంతా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్లలో.. గ్రూపులుగా ఏర్పడి.. కౌశల్కు అండగా నిలబడతున్నారు. కౌశల్ ఎన్ఆర్ఐ గ్రూపులు కూడా ఏర్పడ్డాయి. కౌశల్ ఓవర్ నైట్లో స్టారైపోయాడు.
కౌశల్ అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కౌశల్ను బిగ్బాస్ హౌస్లో టార్గెట్ చేసేవారెవరినీ వీరు వదలడం లేదు. బయటకు లాగి పడేస్తున్నారు. బిగ్బాస్ షో మొత్తం ప్రేక్షకుల ఓట్లతోనే నడుస్తుంది. అంతే.. కౌశల్ను ఇబ్బంది పెట్టేవాళ్లకు ఓట్లు వేయకుండా.. మిగతా వారికి వేసి.. తమకు నచ్చని వారిని కౌశల్ ఆర్మీ వెంటపడి మరీ దెబ్బకొడుతోంది. సామాన్య ప్రేక్షకులు సైతం కౌశల్కే ఎక్కువ మద్దతు పలుకుతూ.. అతనికే బాసటగా నిలుస్తుండడంతో.. ఇప్పుడు కౌశల్ ఓ స్టార్ హీరోగా మారిపోయాడు. తాజాగా.. ఈ వారం ఎలిమినేషన్లలో కౌశల్తో పాటూ బాబూ గోగినేని, దీప్తి నల్లమోతు, నందిని, గణేష్ ఉన్నారు. తమకు నచ్చిన వాళ్లకు ఓట్లను వేసి.. వీళ్లలో ఎవరు హౌస్లో ఉండాలి. ఎవరు ఉండకూడదనేది ప్రేక్షకులే డిసైడ్ చెయ్యాలి. దీంతో.. మిగతా నలుగురికి కలిపి 10 శాతం ఓట్లు వస్తుంటే.. కౌశల్కు 90శాతం ఓట్లు పడుతున్నాయి. ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు నిర్వహిస్తున్న బిగ్బాస్ ఎగ్జిట్పోల్స్ అన్నింటిలోనూ ఇదే ఫలితం వస్తోంది. ప్రజలను ఎవరు గెలుస్తారని ప్రశ్నిస్తుంటే.. నూటికి 99శాతం మంది కౌశల్ పేరే చెబుతున్నారు. బిగ్బాస్ విజేతను ఎన్నుకునే అధికారం ప్రేక్షకులదే కనుక.. కౌశల్ను మించిన ఫాలోయింగ్ను తపస్సు చేసినా.. మిగతా కంటెస్టెంట్లకు సాధ్యం కాదనేది స్పష్టమైపోయింది. కౌశల్ను ఇబ్బంది పెట్టేలా ఉండే ప్రోమోలను స్టార్ మా విడుదల చేస్తుంటే.. లక్షల్లో డిస్లైకులు కొడుతున్నారు. అదే కౌశల్కు మంచి జరిగేలా ప్రోమోలు పెడితే.. లక్షల్లో లైకులు పేలుతున్నాయి. విజేతగా.. కౌశల్ తప్ప మరెవరినీ ప్రేక్షకులు ఊహించుకోలేకపోతున్నారనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం.