తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో రోజు రోజుకి పలు ఆసక్తికరమైన సంఘనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వగానే బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ హోస్మెట్స్కు ఇచ్చారు.ఇంటి సభ్యులను రెండు జట్లుగా వీడదీసిన బిగ్బాస్.. టెలికాలర్స్ Vs పబ్లిక్ కాలర్స్ అనే టాస్క్ను ఇచ్చాడు. బిగ్బాస్ టెలికాలర్స్ జట్టులో కౌశల్, సామ్రాట్, నూతన నాయుడు, అమిత్, శ్యామల, దీప్తిలు ఉండగా.. గీతా మాధురి, తనీశ్, దీప్తీ సునయన, గణేశ్, రోల్రైడా, పూజా రాంచంద్రన్లు పబ్లిక్ కాలర్స్గా వ్యవహరించారు.బిగ్బాస్ టెలికాలర్స్ను విసుగెత్తించి కాల్ కట్ చేసేలే చేస్తే పబ్లిక్ కాలర్స్కు ఓ పాయింట్ లభిస్తోంది.దీంతో హోస్మెట్స్ అంత మళ్లీ కౌశల్ను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. తొలుత కాల్ చేసిన గీతా మాధురి ఈ వారం నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. అతన్ని విసిగించసాగింది.
అబద్దాలు ఆడుతున్నావని, గేమ్ కోసం ఏమైనా చేస్తావా? అని ఘాటుగా ప్రశ్నించింది.దీప్తి సునయన సైతం మళ్లీ కౌశల్కే కాల్ చేసింది. షో ఆరంభం నుంచే అతనంటే గిట్టని సునయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. కౌశల్ ఫోన్ ఎత్తగానే అసభ్య పదజాలంతో మొదలు పెట్టింది. ఎంత పర్సనల్గా దాడి చేసినా కౌశల్ మాత్రం అదే రితీలో బదులిచ్చాడు. ఒక దశలో వీరి సంభాషణ హద్దులు దాటింది. ముఖ్యంగా సునయన కౌశల్ను కించపరిచేలా మాట్లాడుతూ అతని సహనాన్ని పరీక్షించింది. ఇక గణేశ్ కూడా కౌశల్నే టార్గెట్ చేసి మాట్లాడాడు.కౌశల్ను ఇలా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు,ఇలా చాలాసార్లు అతనిని హోస్మెట్స్ అందరు కలిసి ఒంటరి చేసి ఆడుకున్నారు.మరి దీనిపై బయట ఉన్న కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.