అల్లూ అర్జున్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి శ్రీను ఇప్పుడు ఇండస్ట్రీ లో హీరోలు అందరూ కోరుకునే డైరెక్టర్ గా ఎదిగాడు. మొదటి సారిగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్న బెల్లం కొండ సరైనోడు తరవాత ప్రాజెక్ట్ మీద చాలా నెలలు గడిపేశారు. సినిమా మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకుని ఇప్పుడు తీరికగా మొదలు పెట్టారు.
స్క్రిప్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకపోవడం బోయపాటికి స్ట్రెంగ్త్ కం వీక్ నెస్ కూడా. అందుకే ఏప్రిల్ లో సరైనోడు విడుదలైతే.. ఇప్పటికి కానీ బెల్లంకొండ ప్రాజెక్టుపై క్లారిటీ రాలేదు. నవంబర్ 4 నుంచి ఈ మూవీని స్టార్ట్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు.
హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఇప్పటికే ఖాయం చేసిన సంగతి తెలిసిందే. బోయపాటి స్టైల్ లోనే ఇది పక్కా యాక్షన్ ఎంటర్టెయినర్ గానే తెరకెక్కనున్నా.. తగినన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. దీపావళి పండుగ తర్వాత నుంచి మొదలుపెట్టి.. సుదీర్ఘమైన షెడ్యూల్స్ ప్లాన్ చేశారట.
Related
