మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన చిత్ర బృందం అభిమానులకు ఓ శుభవార్త వినిపించింది. సోషల్ మీడియాతోపాటు వెండితెరపైనా ట్రైలర్ దుమ్ము రేపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్ సందడి చేయనుంది. ఏప్రిల్ 12న సాయంత్రం 5:49 గం.లకు ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి పవర్ఫుల్గా కనిపించనున్నారు. చిరుకు జోడీగా కాజల్ నటించింది. రామ్చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిరంజన్రెడ్డి, అవినాష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?