ఏ తల్లిదండ్రులైనా.. తమకంటే ఎత్తుకు తమ పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తల్లిదండ్రుల మనసు అలాగే ఉంటుంది. తాజాగా చిరంజీవి సైతం తన కుమార్తె విషయంలో అలాగే ఆకాంక్షించారు. సినీ నిర్మాణ రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న తన కుమార్తె సుష్మితకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘శ్రీదేవి శోభన్ బాబు’ పేరుతో సుష్మిత ఓ మూవీని నిర్మిస్తోంది. నిర్మాతగా ఇదే ఆమె తొలి ప్రయత్నం. సంతోష్ శోభన్, గౌరీ కృష్ణన్ జంటగా.. నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా ప్రేమ కథ చిత్రం ఇది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల చిరంజీవి ‘ఆచార్య’ ప్రీరిలీజ్ వేడుకలో లాంఛ్ చేశారు. తాను ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా సినిమాలో నటిస్తానంటూ సుష్మితకు చిరంజీవి ఆఫర్ ఇచ్చారట. కథ, దర్శకుడు ఇలా అన్నీ కుదిరితే ఆ ప్రాజెక్టులో నటించేందుకు మెగా స్టార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 30 నుంచి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. ఆ మొత్తాన్ని కుమార్తె కోసం వదులుకునేందుకు సిద్ధమవుతున్నారీ డాడీ.
ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?