అబుదాబిలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2017 వేడుకలు ఇటివలే ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు.. మొదటి రోజే ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి.. హీరో రాణా.. కమెడియన్ అలీ.. నటి మంచు లక్ష్మి యాంకర్లుగా చేశారు. మొదటి రోజే వారు తమదైన శైలిలో హ్యాస్యాన్ని పండించి అందరినీ అలరించారు. ముఖ్యంగా ఆలీ ముందు వరసలో కూర్చున్న వారి దగ్గరకు వెళ్లి… మీ గురించి మీరు విన్న గాసిప్స్ గురించి చెప్పమంటూ… సరదా ప్రశ్నలు అడిగారు. అక్కడే ఉన్న నారా బ్రాహ్మణిని కూడా ప్రశ్న అడగమని కొందరు అడిగారు. అప్పుడు ఆలీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిస్ లో మిమిక్రీ చేసి.. వారికి జవాబు ఇచ్చారు.
{loadmodule mod_custom,GA1}
నేను బ్రాహ్మణి గారిని ఏ ప్రశ్నను అడగను.. ఎందుకంటే.. నేను హైదరాబాద్ వెళ్లగానే.. బాబుగారు.. ఏం చేశారు మీరు? ఏం అన్నారు మా ఇంటి అమ్మాయిని? అని నన్ను ప్రశ్నిస్తారని సరదాగా అన్నారు. చంద్రబాబుగారు కొంచెం పరవాలేదు. కానీ బాలకృష్ణ గారి కోపాన్ని తట్టుకోవడం తన వల్ల కాదని అలీ సరదా కామెంట్స్ చేశారు. ఏంరా ఏమన్నావ్ మా అమ్మాయిని? ఏదో అన్నావంట? ” అని బాలయ్య బాబు తన మీద మండిపడతారని అలీ మిమిక్రీ చేశారు. బ్రహ్మణిగారిని ఆ ప్రశ్న అడిగితే తనకు తర్వాతి బర్త్ డే ఉండదని అలీ చమత్కరించారు. దాంతో అక్కడ ఉన్నావరంత తెగ నవ్వుకున్నారు. బ్రాహ్మణి కూడా సరదాగా తీసుకొని.. నవ్వేసింది. ఇక బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తరపున సౌత్ ఇండియన్ బిజినెస్ అవార్డును పొందారు. ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఈ అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి ప్రసంగం కూడా అందరిని ఆకట్టుకుంది.
{youtube}yOXRpeWbc0I{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related