జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు రాజకీయంగా బిజీగా ఉంటున్నాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్గా మారింది.
ఇంత తక్కువ టైంలో పవన్ ఎన్నికలకు తన టీంను సిద్దం చేస్తున్నాడు. ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాడన్న డౌట్లు అందరికి ఉన్నాయి. ఈ తక్కువ టైంలో పవన్ తనకంటూ ఓ స్పెషల్ టీంను రెడీ చేసుకుని ఆ టీంతోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ నెపథ్యంలో మెరికల్లాంటి కుర్రాళ్ల కోసం జనసేన ఇప్పటికే రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. యువతతో పాటు సీనియర్లకు కూడా పవన్ ప్రయారిటీ ఇస్తున్నారు.
పవన్కు మంచి ఫ్రెండ్ అయిన ఆలీ కూడా జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచరం. ఆలీకి గుంటూరు తూర్పు లేదా రాజమండ్రి అర్బన్ టిక్కెట్టును కేటాయిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ముస్లిం ఓటర్లు ఎక్కువుగా ఉన్న నియోజకవర్గాల్లో ఆలీకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక పవన్ ముస్లిం ఓట్లపై స్పెషల్ కేర్ తీసుకుంటే ఆ వర్గాల్లో మంచి పట్టున్న కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవు. ఏపీలో ముస్లింలు కాంగ్రెస్కు సుదీర్ఘకాలంగా ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే.
{loadmodule mod_sp_social,Follow Us}
Related