Thursday, April 25, 2024
- Advertisement -

దిల్ రాజు అమెరికా పయణం.. ఎందుకంత అర్జెంట్?

- Advertisement -

భారత్‌లో మహమ్మారి రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. కేసులు, మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో అనేక దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా.. ఆస్ట్రేలియా, పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. అయితే దీనికన్నా ఒకరోజు ముందే అంటే మే 3వ తారీఖునే ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌ రాజు అర్జంటుగా అమెరికాలో ల్యాండ్‌ అయిపోయాడట. తన భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని తీసుకుని ఆయన అమెరికా వెళ్లిపోయినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

దిల్ రాజు తన పర్శనల్ పనిమీద అమెరికా వెళ్లాలి. ఈ ట్రావెల్ బ్యాన్ తో ఇబ్బంది అవుతుందని, ఆయన నిన్ననే అమెరికా వెళ్లిపోయారు. . ‘వకీల్ సాబ్’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు అక్కడికి వెళ్లాడని అంటున్నారు. నిజానికి దిల్‌ రాజు భార్యతో కలిసి అమెరికా వెళ్లాలని ఎప్పటినుంచో హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌3’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నాగచైతన్య ‘థాంక్యూ’, సమంత ‘శాకుంతలం’, అవసరాల శ్రీనివాస్‌ ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’, రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.

చిన్నప్పటి బన్నీ లవర్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు?

సినీ కార్మికులకు అండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్

డాన్ కొడుకుగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -