Thursday, May 16, 2024
- Advertisement -

ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్!

- Advertisement -

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దిలీప్‌కుమార్‌ అస్వస్థతకు లోనయ్యారు. కొంతకాలంగా ఆయన శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్డియాల‌జిస్ట్ నితిన్ గోఖ‌లె, ప‌ల్మనాల‌జిస్ట్ జ‌లీల్ ప‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స అందుతోంది. దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రిస్థితిని వారు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

దిలీప్ కుమార్ ఏ అనారోగ్య స‌మ‌స్య‌ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరార‌న్న విష‌యంపై స్ప‌ష్టత రాలేదు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి, అందిస్తోన్న చికిత్స‌పై వైద్యులు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించ‌క ముందు కూడా దిలీప్ కుమార్ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. తాను , త‌న భార్య సైరా భాను ఐసోలేష‌న్‌లో ఉంటున్నామ‌ని చెప్పారు.

ఇక దిలీప్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. 1944 లో జ్వార్ భాటాతో వెండితెరపై కాలు మోపారు. కోహినూర్, ఆజాద్‌, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్‌, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్‌ వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిసారిగా 1998లో ‘ఖిలా’ చిత్రంలో నటించారు.

బిగ్ బాస్ కి నో చెప్పిన పవన్ హీరోయిన్!

పెళ్లి కూతురుగా మెరిసిపోయిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ!

మిస్ట‌ర్ బీన్ చనిపోయాడంటూ అసత్య ప్రచారం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -