దర్శకరత్న దాసరి నారాయణ రావు గురించి తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జస్టిస్ చక్రవర్తి, ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, మజ్ను, తాండ్రపాపారాయుడు వంటి 150కి పైగా హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించారు.
కేవలం సినిమాల్లోనే కాక రాజకీయాలలోను దాసరి చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఈ రోజు హైద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వెంటిలేటర్పై వైద్య చికిత్సను తీసుకుంటున్న ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడ్తున్నారనీ, ఆయనకు డయాలసిస్ చేస్తున్నామనీ, కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నామని తెలిపారు. దాసరి కిమ్స్ లో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన పరామర్శించారు. ఏది ఏమైనా దాసరి త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.