డైరెక్టర్ హరీశ్ శంకర్.. మాస్ సినిమాలు తెరకెక్కించడంలో ఎక్స్పర్ట్ అన్న విషయం తెలిసిందే. హరీశ్ శంకర్ డైరెక్టర్ మాత్రమే కాక.. మంచి రచయిత కూడా.. ఎన్నో సినిమాలకు రచనా సహకారం కూడా అందించాడు. తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం ఆయనకు.. గబ్బర్సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో హరీశ్ శంకర్ పేరు మారుమోగిపోయింది. అంతకుముందు షాక్, మిరపకాయ్ వంటి సినిమాలకు డైరెక్టర్ అయినా పెద్దగా పేరురాలేదు. గబ్బర్ సింగ్ తర్వాత ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేశాడు హరీశ్ శంకర్ .
సాయిధరమ్ తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథమ్, వరుణ్తేజ్తో గద్దలకొండ గణేష్ తెరకెక్కించి హిట్స్ కొట్టాడు హరీశ్ శంకర్. బేసిక్గా రైటర్ అయిన హరీశ్ శంకర్.. పదునైన సంభాషణలు కూడా రాస్తుంటాడు. ఇప్పటివరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హరీశ్ శంకర్ ఒక్క మూవీ కూడా చేయలేదు. త్వరలో పవన్ కళ్యాణ్ తో మైత్రీ మూవీ మేకర్స్ కోసం చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే హరీశ్ శంకర్ త్వరలో ఆహా కోసం ఓ వెబ్ సీరిస్ను నిర్మించబోతున్నాడట. ఈ వెబ్సీరిస్కు ప్రముఖ దర్శకుడు కథను అందిస్తున్నాడు. ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ వెబ్ సీరిస్తో గీతా ఆర్ట్స్లోకి అడుగుపెట్టబోతున్నాడు హరీశ్ శంకర్. పవన్ 28 వ సినిమాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో హరీశ్ శంకర్ ఈ బాధ్యతలు చేపడుతున్నాడు.
Also Read
అప్పుడు తేజు సాహసం.. ఇప్పుడు చైతూ వంతు..!
నారప్ప విడుదలకు సిద్ధం..!