దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ను హీరోగా పెట్టి ఆయనే సొంతంగా నిర్మించిన సినిమా ‘మెహబూబా’. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదలకు రెడీ అవుతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్స్ పెంచేశారు చిత్ర యూనిట్.సినిమా ప్రమోషన్స్లో భాగాంగా పూరి మాట్లాడుతు ఆకాష్ను హీరోగా చేస్తామని చాలామంది నా దగ్గరకు వచ్చారని ..కాని ఎవరో ఎందుకు నేనే నా కొడుకుని హీరోగా ఎందుకు చేయకుడదనే కసితో సినిమా చేశానని చెప్పుకొచ్చాడు పూరి.
సినిమా చాలా ఫ్రేష్గా ఉంటుందని సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నానని తెలిపారు.ఈ సినిమా కోసం తన ఇల్లును కూడా అమ్మేశానని తెలిపారు. సినిమా రష్ చూసి పంపిణి చేయడానికి దిల్ రాజు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సహనిర్మాతగా హీరోయిన్ ఛార్మీ వ్యవహరించారు. సినిమా మొత్తన్ని దిల్ రాజు తీసుకొవలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.