Thursday, May 2, 2024
- Advertisement -

మెంట‌ల్ మ‌దిలో ద‌ర్శ‌కుడికి ఓ మంచి ఆఫ‌ర్‌

- Advertisement -

ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా కాలం క‌లిసి రాక సుమంత్ సినిమాల‌పై నిరాశ‌తో ఉన్నాడు. అతడికి ‘మ‌ళ్లీరావా’ సినిమాతో మంచి విజ‌యం అందించిన ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ‘మ‌ళ్లీరావా’ సినిమా ఫీల్‌గుడ్ మూవీగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ‘మ‌ళ్లీరావా’ సినిమా బాగానే థియేట‌ర్ల‌లో ఆడుతోంది. డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌లైన సినిమాల్లో ఇది చెప్పుకోద‌గ్గ‌ది. ‘మ‌ళ్లీరావా’ సినిమా ప్రింట్‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫోన్ చేసి మ‌రీ అడిగారంట‌. అందుకే ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.

తొలి చిత్రంతోనే యువ‌ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆక‌ట్టుకున్నాడు. ప్రేమ కథను కొత్తగా చెప్పిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అందుకే ఆ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, సమర్పకులు డి. సురేశ్‌బాబు కలిసి వివేక్ ఆత్రేయతో మ‌రో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు.

ఈ చిత్రానికి ఇప్పటికే ‘బ్రొచేవారెవరురా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారంట‌. ఇది కొత్త తరహా సినిమాగా భావిస్తున్నారు. స్టోరీ లైన్‌తో రూపొందబోయే సినిమాగా ఉండ‌నుంది. అయితే ఈ సినిమాలో నటీనటులు, షూటింగ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌నే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -