ఇటీవల ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సినిమా బృందానికి చుక్కలు చూపిస్తోందని.. హీరోలను ఇబ్బంది పెడుతోందని.. ఆమె ప్రవర్తన తీరుపై తోటి నటీనటులు ఇబ్బందికి గురవుతున్నారని పుకార్లు వస్తున్నాయి. గతంలో నాని నటించి ఎంసీఏ సినిమా విషయంలోనూ.. ఆ తర్వాత మరో సినిమాలోనూ ఇలాంటివి వినిపించాయి. ఇప్పుడు యువ నటుడు నాగశౌర్యతో అదే విధంగా ప్రవర్తించిందని సమాచారం. నాగశౌర్య, సాయి పల్లవి కలిసి ‘కణం’ సినిమాను చేశారు. ఈ సినిమా ఆడియో విడుదల ఇటీవల నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాన పాత్రగా ఉన్న హీరో నాగశౌర్య రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది.
నాగశౌర్య రాకపోవడంతో సాయిపల్లవిని అందరూ నిందితురాలిగా చేశారు. తనను సాయి పల్లవి ఇబ్బంది పెట్టినట్లు ఇటీవల ఓ షోలో శౌర్య బాహాటంగానే ప్రకటించాడు. అయితే ఈ పుకార్లపై సాయిపల్లవి వివరణ ఇచ్చారు.శౌర్య భావాలను తాను గౌరవిస్తాను.. కానీ నేను ఎవరిని బాధపెట్టే మనిషిని కాదు అని చెప్పుకొచ్చింది. శౌర్య తన గురించి మాట్లాడిన మాటలు తనకు షాక్కు గురి చేశావని బాధపడింది. వెంటనే డైరెక్టర్ విజయ్ అలానే సినిమాటోగ్రాఫర్ నిర్వవ్ షాను పిలిచి సెట్లో తన కారణంగా ఎవరైనా.. ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని అడిగి తెలుసుకున్నాని చెప్పింది. అలాంటిదేమీ లేదని అందరూ చెప్పారు.
ఇప్పుడు శౌర్య ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడో అర్ధం కాలేదని తెలిపంది. ఒక సినిమా కోసం అందరూ కలిసి పని చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే అది డైరెక్టర్తో చర్చించాలి. శౌర్య మంచి నటుడు కానీ నా గురించి ఎందుకు అలా మాట్లాడారో తెలియడం లేదు. ఆయన మాటలకు నేను చాలా బాధ పడ్డా అంటూ పేర్కొంది. నాగశౌర్య, సాయిపల్లవి కలిసి నటించిన ‘కణం’ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది.