నందమూరి హీరోల మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఎవరు మాట్లడాకపోవడంతో నిజంగానే వీరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే అనమానలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ శాతకర్ణి ట్రైలర్ విడుదల అయినప్పుడు నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ట్రైలర్ అద్భుతంగా ఉందని పొగిడేశారు. శాతకర్ణి లాంటి చిత్రం బాబాయ్ తప్ప ఎవ్వరూ చేయలేరని అన్నారు.
దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని అనుకున్నారు. 2019 ఎన్నికల క్రమంలో బాలయ్య, ఎన్టీఆర్ ఒక్కటవుతారని అందరూ అనుకున్నారు. అయితే తాజా పరిణామాలు గమనిస్తే వీరి మధ్య గ్యాప్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఆ గ్యాప్ అలాగే ఉందా అంటే అవుననే సందేహాలే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఇటివలే గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుక తిరుపతిలో చాలా గ్రాండ్గా జరిగింది.
ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఎవ్వరూ ఈ పంక్షన్ కి రాలేదు. ఈ విషయంపై ఎవరికి వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ వర్గాల ప్రకారం శాతకర్ణి టీం నుంచి వీరికి అసలు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. హరికృష్ణ తనయుడు స్వర్గీయ జానకిరామ్ పిల్లల పంచెకట్టు పంక్షన్ ఇటివలే కాకినాడలో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు హాజరై దగ్గరుండి ఏర్పాట్లను చూసుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్నికి బాలయ్య రాకపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఏదేమైనా.. హరికృష్ణ, బాలయ్య మధ్య గ్యాప్ అసలు తగ్గలేదన్న టాక్ జోరుగా వినిపిస్తోంది.
Related