- Advertisement -
ప్రస్తుతంగా మెగా నటుడు రామ్చరణ్ తేజ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో.. గోదావరి గట్టున ఉన్న ఓ గ్రామంలో ఉన్న సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత రామ్చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
రామ్చరణ్కు అన్నయ్యగా ఈ సినిమాలో తమిళ్ హీరో ప్రశాంత్ అన్నయ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రశాంత్ గతంలో శంకర్ దర్శకత్వం వహించిన జీన్స్ సినిమాలో నటుడిగా నటించాడు. బోయపాటి, చరణ్ సినిమా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది. హీరోయిన్గా కైరాఅద్వానీ నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.