ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉదృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్యులనే కాక సెలబ్రిటీలని సైతం ఇది వణికిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రెటీలకు కరోనా పాజిటీవ్ రావడం… కొంత మంది మృత్యువాత పడటం కూడా జరిగింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కరోనా వచ్చిందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ తాను మూడు సార్లు టెస్ట్ చేయించుకున్నానని.. తనకు నెగిటీవ్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
అయితే కరోనా వ్యాప్తి బాగా ప్రబలి పోవడం చూస్తున్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకినట్టు ట్విట్టర్లో తెలియజేశారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. కరోనా లక్షణాలు ఏవి లేవు. గత కొద్ది రోజులుగా నన్ను కలిసి వాళ్లు పరీక్షలు చేయించుకోండి.
త్వరలోనే కోలుకొని మీ ముందుకు వస్తాను అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు రామ్ చరణ్. త్వరలో ఈ మూవీ షూట్ లో పాల్గొనబోతున్న నేపథ్యంలో కరోనా సోకడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.