మిర్యాల గూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈపరువు హత్యపై సోషియల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇప్పటికే ఈ హత్యను పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ముక్త ఖంటంతో ఖండించారు. ఇప్పటికే సింగర్ చిన్మయి, మంచు మనోజ్ ఈ విషయంపై స్పందించగా తాజాగా హీరో రామ్ కూడా మాట్లాడారు.
ట్విట్టర్ వేదికగా ప్రణయ్ ని హత్యపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఓ పక్క సెక్షన్ 377 ని తీసేస్తే.. ఇంకా ఈ కులాలు, పరువు హత్యలు ఏందిరా జంగిల్ ఫెలోస్. ముందు మనుషులుగా ఎలా బతకాలో తెలుసుకోండి” అంటూ రాసుకొచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే రామ్ ప్రస్తుతం హలొ గురు ప్రేమ కోసమే అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నాడు.
O pakka #Section377 ne etheste inka e Caste-lu..Honor Killing-lu endhi ra Jungle Fellows! #PranayAmrutha 💔 …for God sake, learn to be a #HUMANFIRST !!!! – R.A.P.O
— RAm POthineni (@ramsayz) September 17, 2018